Home Minister Anitha: కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. విస్ఫోటనం జరిగిన తీరును, అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలను మంత్రులు స్వయంగా పరిశీలించారు. ఈ ఘోర ప్రమాదం పట్ల వారు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
Read Also: CJI SuryaKant: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు
అధికారుల నుంచి వివరాల సేకరణ.. విచారణకు ఆదేశం
ప్రమాదం ఎలా సంభవించింది? అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అనే అంశాలపై మంత్రులు అక్కడి పోలీసు, రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. ప్రమాద తీవ్రతకు గల కారణాలను సాంకేతిక నిపుణుల ద్వారా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లావ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మంత్రి అనిత, మంత్రి నారాయణ ఓదార్చారు. అలాగే వారికి చెక్కులు అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: