VasanSettiSubhash: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పరిమితమైన ఆ పార్టీ ఏపీలోకి రావాలనుకుంటే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా శెట్టిబలిజల సమాజాన్ని ఉద్దేశిస్తూ, తమ హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే శెట్టిబలిజలంతా కలిసి ఎదిరిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Also: Brahmin Marriage Meet Tirupati: బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన
జగన్ కు యోగా అవసరం
ఆ పార్టీ ఏపీలోకి వస్తే శెట్టిబలిజలంతా కలిసి తొక్కిపడేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో గత సీఎం కేసీఆర్ శెట్టిబలిజలను ఓసీల్లో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. మరోవైపు, ఏపీ మాజీ సీఎం జగన్ మానసికంగా ఇబ్బందిపడుతున్నారని, ఆయనకు యోగా అవసరమని వాసంశెట్టి సెటైర్ వేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, ఇతర నేతలు మాట్లాడుతూ.. కుల ఐక్యతతోనే సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. శెట్టిబలిజలు రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని శాసించే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టిన నేపథ్యంలో, శెట్టిబలిజలను తిరిగి బీసీల్లో చేర్చే అంశంపై జరుగుతున్న చర్చల మధ్య మంత్రి సుభాష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: