📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu news: Minister Satyaprasad: భూమనే పరకామణి కేసు సూత్రధారి

Author Icon By Tejaswini Y
Updated: December 2, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి : ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకునే కానుకల లెక్కింపుపరకామణిలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న కేసులో సూత్రధారి, పాత్రధారి వైసిపి నేత భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy)యేనని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Satyaprasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందితులెవరో తెలిసిపోతుందని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

Minister Satyaprasad: Bhumane is the mastermind of the Parakamani case

పింక్ డైమండ్ – పరకామణి వివాదం

దేవుని సొమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీచేయడం చరిత్రలో వినలేని చూడలేని విషయమన్నారు. ఆ కేసులో భూమన కరుణాకర్రెడ్డి ఉండటంతోనే కేసు విచారణపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. దేవుడిపై నమ్మకంలేని ఆయనకు పింక్ డైమండ్(Pink Diamond), గోశాలతోపాటు ఇతర అంశాలపై అబద్దాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఘాటుగా స్పందించారు.

పరకామణిలో చోరీచేసిన నిందితుడు నుండి ఆస్తుల బదలాయింపు కరుణాకర్రెడ్డికే జరిగిందని ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసులోనూ తప్పు జరిగినట్లు విచారణలో అందరూ అంగీకరించారని, కానీ తప్పు మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూస్తే తప్పు చేసిన వారికి శిక్షతప్పదని అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబజిస్ట్రార్ వ్యవహారంలో స్థానిక డిఐజి ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BhumanaKarunakarReddy MinisterSatyaPrasad ParakamaniCase PoliticalControversy TempleFundsTheft tirupati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.