తిరుపతి : ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకునే కానుకల లెక్కింపుపరకామణిలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న కేసులో సూత్రధారి, పాత్రధారి వైసిపి నేత భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy)యేనని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Satyaprasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందితులెవరో తెలిసిపోతుందని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్
పింక్ డైమండ్ – పరకామణి వివాదం
దేవుని సొమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీచేయడం చరిత్రలో వినలేని చూడలేని విషయమన్నారు. ఆ కేసులో భూమన కరుణాకర్రెడ్డి ఉండటంతోనే కేసు విచారణపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. దేవుడిపై నమ్మకంలేని ఆయనకు పింక్ డైమండ్(Pink Diamond), గోశాలతోపాటు ఇతర అంశాలపై అబద్దాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఘాటుగా స్పందించారు.
పరకామణిలో చోరీచేసిన నిందితుడు నుండి ఆస్తుల బదలాయింపు కరుణాకర్రెడ్డికే జరిగిందని ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసులోనూ తప్పు జరిగినట్లు విచారణలో అందరూ అంగీకరించారని, కానీ తప్పు మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూస్తే తప్పు చేసిన వారికి శిక్షతప్పదని అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబజిస్ట్రార్ వ్యవహారంలో స్థానిక డిఐజి ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: