కాకినాడ : సాంకేతికలతో రవాణా శాఖను బలోపేతం చేసి రాష్ట్రంలో రహదారి భద్రతను మరింత పెంపొందిస్తామని రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) కాకినాడ పర్యటనలో భాగంగా, మద్యాహ్నం స్థానిక జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖా పరమైన కార్యక్రమాల అమలు ప్రగతి, వాటి నిర్వహణలో అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షి సందర్భంగా రవాణా శాఖలో పారదర్శకత, సమర్థ సేవల కల్పన, ఆదాయ వృద్ధి, రహదారి భద్రత తదితర అంశాలపై ఆయన అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసారు. గత ప్రభుత్వం కేవలం ఆదాయ సేకరణకే ప్రాధాన్యత ఇచ్చి, సిబ్బంది, వాహనాలను కల్పించకుండా రవాణా శాఖను నిర్వీర్యం చేసిందన్నారు.
త్వరలో అన్ని కార్యాలయాలకు భవనాల నిర్మించేందుకు
రవాణా శాఖలో ఖాళీగా ఉన్న ఆర్టిఓ, డిటిసి, ఎఓ, యంవిఐ, ఓయంవిఐ, ఇతర కేడర్ పోస్టులను భర్తీ చేసి, వాహనాలు, ఇతర కనీస అవసరాలను కల్పించి శాఖకు పూర్వ వైభవాన్ని తెస్తామన్నారు. అలాగే జిల్లాల విభజన జరిగాక, చాలా జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు సరైన భవనాలు కూడా లేవని, త్వరలో అన్ని కార్యాలయాలకు భవనాల నిర్మించేందుకు ప్రతిపాదించామన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గ్రీన్ టాక్స్ రద్దు చేయడం వల్ల ఆదాయ సేకరణ (Revenue collection) తగ్గినప్పటికీ, ఎన్ ఫోర్స్ మెంట్ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడం, ఫీజులు, జరిమానాలను సమర్థవంతంగా వసూలు చేయడం ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యాలను సాధించాలని అధికారులకు మంత్రి సూచించారు.
తగు చర్యలు
రహదారి భద్రతా కార్యక్రమాలను మరింత విసృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలలో అవగాహన, ఆచరణ పెంచాలని కోరారు. ఓవర్ లోడింగ్, డ్రంకెన్ డ్రైవ్ లను నిరోధించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. క్షేత్ర స్థాయిలో రవాణా ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. అనంతరం సమావేశంలో రహదారి భద్రత సందేశాలతో రవాణా శాఖ ప్రచురించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
మార్గదర్శకాల కనుగుణంగా
మంత్రి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రవాణా శాఖ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ఒక ఎటిఎస్ ఫిట్ నెస్ సెంటర్లు (ATS Fitness Centers) ఏర్పాటు జరుగుతోందని, ఈ కేంద్రాలకు దూరంగా ఉన్న వాహనదారులకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఎక్కువ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం ఏది?
విశాఖపట్నం (Vizag) — ఇది ఆర్థికపరంగా, పారిశ్రామికంగా అతి పెద్ద నగరంగా గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద జిల్లా ఏది?
అనంతపురం జిల్లా (పాత గణన ప్రకారం), ఇప్పుడు విభజనల తర్వాత తిరుపతి జిల్లా జనాభా పరంగా పెద్దది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Tirupati: తిరుపతిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు