విజయవాడ: ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అధికారంలోకి వచ్చిన 16 మాసాల కాల వ్యవధిలోనే సూపర్ హిట్ గా కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్” (Super Six Super Hit)సభ విజయవంతం అవ్వడమే కాకుండా సభా ప్రాంగణాన్ని దాటిపోయి దాదాపు 12 కి.మీ. వరకు ప్రజలు బారులు తీరి నిల్చుండిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అత్యల్ప కావలవ్యవధిలోనే తమ కూటమి ప్రభుత్వం మోగించే విజయదుందుభిని తట్టుకోలేక ప్రధాన ప్రతిపక్ష నాయకులు అక్కస్సుతో చేసే విమర్శలలో ఏమాత్రం నిజం లేదని ఆయన తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఉన్న వయస్సును, అనుభవాన్ని గౌరవించకపోగా, వారిపై శాపనార్థాలు పెట్టే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పర్చకపోగా, అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా రాష్ట్రం అప్పుల ఊబిలో దింపడం జరిగిందన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడంలోనే నాలుగైదు మాసాలు గడిచిపోయాయని, మిగిలిన ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు.
16 మాసాలలో హామీలు అమలు చేశాం” అనే వ్యాఖ్య వెనుక అర్థం ఏమిటి?
మంత్రి పార్ధసారధి అంటున్నది – ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 16 నెలల వ్యవధిలోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం అమలయ్యాయని. ఇది వారి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also:
Telugu News: Tirumala-బ్రహ్మోత్సవాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత