📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: Minister Narayana: ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. నెల్లూరులోని (Nellore) ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మెగా పీటీఎం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read Also: Tirupati: పరకామణి కేసులో కీలక ట్విస్ట్!

ఈ సందర్భంగా, మాక్ అసెంబ్లీలో ప్రతిభ చాటి ముఖ్యమంత్రి వద్ద ప్రశంసలు పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని మేమ హర్షితను మంత్రి నారాయణ సన్మానించారు. అదేవిధంగా, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన ఆరుమంది విద్యార్థినీ, విద్యార్థులను కూడా ఆయన అభినందించారు. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Minister Narayana We will upgrade government schools to international standards

మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన: విద్యార్థులతో కలిసి భోజనం

మంత్రి నారాయణ వీఆర్సీ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. భోజనం యొక్క నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి భోజనం చేశారు. తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు “థాంక్యూ సార్” అంటూ నినాదాలు చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, సదుపాయాలతో పాటు విద్యాబోధన బాగుందని చిన్నారులు మంత్రికి తెలిపారు.

వీఆర్‌సీ తరహాలో 15 హైస్కూళ్లు: పీ4 ద్వారా పేదల అభ్యున్నతి

అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, యువనేత లోకేశ్ సహకారంతో మరో పదిహేను హైస్కూల్స్‌ను వచ్చే విద్యా సంవత్సరానికి వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పీ4 (P4) ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ కమీషనర్ నందన్, డీఈఓ బాలరాజు తదితర అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPradeshEducation APUrbanDevelopment Google News in Telugu GovernmentSchoolsUpgrade InternationalStandards Latest News in Telugu LokeshSupport MinisterNarayana NelloreEducation Telugu News Today VRCHighSchool

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.