हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu News: Minister Narayana: ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

Sushmitha
Telugu News: Minister Narayana: ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. నెల్లూరులోని (Nellore) ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మెగా పీటీఎం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read Also: Tirupati: పరకామణి కేసులో కీలక ట్విస్ట్!

ఈ సందర్భంగా, మాక్ అసెంబ్లీలో ప్రతిభ చాటి ముఖ్యమంత్రి వద్ద ప్రశంసలు పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని మేమ హర్షితను మంత్రి నారాయణ సన్మానించారు. అదేవిధంగా, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన ఆరుమంది విద్యార్థినీ, విద్యార్థులను కూడా ఆయన అభినందించారు. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Minister Narayana
Minister Narayana We will upgrade government schools to international standards

మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన: విద్యార్థులతో కలిసి భోజనం

మంత్రి నారాయణ వీఆర్సీ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. భోజనం యొక్క నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి భోజనం చేశారు. తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు “థాంక్యూ సార్” అంటూ నినాదాలు చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, సదుపాయాలతో పాటు విద్యాబోధన బాగుందని చిన్నారులు మంత్రికి తెలిపారు.

వీఆర్‌సీ తరహాలో 15 హైస్కూళ్లు: పీ4 ద్వారా పేదల అభ్యున్నతి

అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, యువనేత లోకేశ్ సహకారంతో మరో పదిహేను హైస్కూల్స్‌ను వచ్చే విద్యా సంవత్సరానికి వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పీ4 (P4) ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ కమీషనర్ నందన్, డీఈఓ బాలరాజు తదితర అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870