ఏపీలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు (DSC exams) ప్రారంభమైన నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర విద్యావ్యవస్థలో సంస్కరణలకు నాంది పలుకుతూ, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.ఉండవల్లిలోని తన నివాసంలో నారా లోకేశ్ (Nara Lokesh) విద్యా శాఖ అధికారులతో నాలుగు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ విజయవంతంగా ప్రారంభమైనందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించారు.”ఇకపై ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. ఖాళీ టీచర్ పోస్టుల్ని అనునిత్యం భర్తీ చేస్తాం” అని లోకేశ్ ప్రకటించారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని, ఈ ఏడాది తొలిసారిగా 4 వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించామని తెలిపారు.
అక్షరాస్యతకు ‘అక్షర ఆంధ్ర’ మిషన్
రాష్ట్రంలో శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ‘అక్షర ఆంధ్ర’ పేరుతో మిషన్ ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 15-59 ఏళ్ల వయస్సులో ఉన్న 81 లక్షల మంది నిరక్షరాస్యుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని, వచ్చే మూడేళ్లలో literacyలో అగ్రదేశంగా నిలవాలన్నదే లక్ష్యమన్నారు.
నైపుణ్యం యాప్తో యువతకు ఉద్యోగ అవకాశాలు
యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు “నైపుణ్యం” యాప్ను బలోపేతం చేయాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్ల్స్పై శిక్షణ ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు.
విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టం
ఉన్నత విద్యలో సంస్కరణల దిశగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. వైస్ చాన్సలర్ల నియామకాన్ని వేగవంతం చేయాలని పేర్కొన్నారు.రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు మానసిక వశ్యత కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
Read Also : Chandrababu Naidu : చంద్రబాబుతో నీతి ఆయోగ్ భేటీ