📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Ration Shop : పిఠాపురంలో రేషన్ దుకాణం ప్రారంభించిన మంత్రి మనోహర్

Author Icon By Sudheer
Updated: June 1, 2025 • 6:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ షాపులు (Ration Shops) ఇవాళ నుంచి మళ్లీ తెరుచుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరఫరా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పిఠాపురం పట్టణంలోని 18వ వార్డులో రేషన్ దుకాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజల మధ్య రేషన్ సరుకులను స్వయంగా పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరళమైన విధానంతో సరుకులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

రోజుకు రెండు పూటలా రేషన్ పంపిణి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ సరుకుల పంపిణీ ప్రతి నెలా 15వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. రోజు రెండు పూటలా — ఉదయం, సాయంత్రం — పంపిణీ జరగనుందని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ సౌకర్యం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల అవసరమైన వారికి సౌకర్యవంతంగా రేషన్ అందుతుందన్నారు.

రేషన్ షాప్ టైమింగ్స్

రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఈ సమయాల్లో వచ్చి తమ సరుకులు తీసుకోవాలని సూచించారు. సరుకు పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Read Also : Gamblers Movie: గ్యాంబ్లర్స్ మూవీ ట్రైలర్ విడుదల

Google News in Telugu nadendla manohar pithapuram ration shop open

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.