📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు

Author Icon By Sudheer
Updated: March 11, 2025 • 11:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం యువత, విద్యార్థులను మోసం చేసిందని, వారి కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని, సంక్షేమ పథకాల అమలు విషయంలో పారదర్శకత పూర్తిగా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

వైసీపీని చిత్తుగా ఓడించిన యువత

మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్, యువత వైసీపీని నమ్మి మోసపోయిందని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పిందని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం చెందిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు యువత కోసం పోరాటం చేస్తున్నట్లు మాట్లాడడం హాస్యాస్పదమని, నిజానికి వారి పాలన వల్లే యువత ఇప్పటి పరిస్థితికి చేరిందని అన్నారు.

వాలంటీర్లను మోసం చేసిన జగన్

వైసీపీ ఇచ్చిన ఉద్యోగ హామీల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని, అయితే ఎన్నికల ముందు జగన్ వాలంటీర్లను వాడుకొని మోసం చేశారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వాలంటీర్ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయకపోవడం దగా రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని జగన్ చెప్పినప్పటికీ, ఒప్పందాలను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అన్ని నివేదికలు పరిశీలించాక, వాలంటీర్ల గడువు ముగిసిందని తేలిందని తెలిపారు.

ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సభ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సభలో విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించామని, జనసేన పార్టీ లక్ష్యం పేదలకు అధికారం పంచడమేనని దుర్గేశ్ స్పష్టం చేశారు.

Google news Janasena minister nadendla manohar ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.