📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

DSC : మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

Author Icon By Sudheer
Updated: May 6, 2025 • 9:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఉండవల్లిలో తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సుమారు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పలు అంశాలపై చర్చించారని సమాచారం.

జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ

జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, టీసీఎస్ అయాన్ కేంద్రాలలో సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లు నిరంతర సేవలందించేలా చూడాలని సూచించారు.

టెట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు ప్రత్యేక ఆప్షన్

డీఎస్సీకి టెట్ అర్హతలే అవసరమని, అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని టెట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు వెరిఫికేషన్ సమయానికి తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలతో అభ్యర్థుల్లో మరింత నమ్మకం పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని గట్టి పునాది మీద నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి హామీ ఇచ్చారు.

Read Also : Sugavasi Palakondrayudu : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Google News in Telugu mega dsc Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.