కృత్రిమ మేధ (AI) మానవ సమాజానికి ప్రమాదం కాదని, అందుకు విరుద్ధంగా అది మానవాళిని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందని రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సు రెండో రోజు “AI భవిష్యత్ ఉద్యోగాలు” అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
Read Also: Chikiri song: 75 మిలియన్ వ్యూస్… యూట్యూబ్ ట్రెండింగ్లో నెంబర్ వన్

Re-skill, Redefine, Re-imagine అనే త్రిముఖ వ్యూహంతో
Nara Lokesh: ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్, “ప్రతి పారిశ్రామిక విప్లవం ఉద్యోగాల సంఖ్యను పెంచేదే తప్ప తగ్గించలేదు. అదే విధంగా AI కూడా కొత్త అవకాశాలను తీసుకొస్తుంది” అన్నారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం మూడు దిశల్లో పని చేస్తోందని Re-skill, Redefine, Re-imagine అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ లక్ష్యంతో ‘నైపుణ్యం’ పేరిట ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫారం రూపొందించినట్లు చెప్పారు.
ఐటీ రంగం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలకమని పేర్కొన్న ఆయన, వ్యాపారవేత్తల ఆదాయాన్ని పలు రెట్లు పెంచడం తమ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. “నెలకు రూ.50,000 సంపాదిస్తున్నవారు ఒక లక్షకు, ఐదు లక్షలు సంపాదిస్తున్నవారు 25 లక్షలకు ఎదగగలుగుతారు. అలా చేస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి తీసుకెళ్లగలం” అని వివరించారు.
రాష్ట్ర వ్యాపారవేత్తలతో భాగస్వామ్యంలో పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావడానికి వెనుకాడబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: