అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం సెజ్లో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు సుమారు రూ. 2,300 కోట్ల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో నిర్మితం కానుంది. ఇది ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్ మరియు CDMO (కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్) రంగంలో కీలకం కానుంది. ఈ పెట్టుబడి ఉత్తరాంధ్ర ప్రాంత పారిశ్రామిక వృద్ధికి (Industrial Growth) భారీ బూస్ట్ ఇస్తుందని, ఈ ప్రాంతాన్ని ఫార్మా హబ్గా మార్చేందుకు దోహదపడుతుందని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫార్మాస్యూటికల్ ఫెసిలిటీ అత్యాధునిక ప్రమాణాలతో నిర్మాణం జరుపుకుని, త్వరలోనే ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :