ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల తొలగింపుపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఏ ఒక్కరికీ పెన్షన్ నిలిపివేయలేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పెన్షన్ల తొలగింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతున్నామే తప్ప, పేదల పొట్ట కొట్టే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా “ఎన్టీఆర్ భరోసా” కింద ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
BC Reservations: ప్రధానిపై రేవంత్ ఒత్తిడి తేవాలి: కవిత
పెన్షన్ల రద్దుకు సంబంధించి మంత్రి సాంకేతిక కారణాలను వివరించారు. గత 20 నెలల కాలంలో ఎవరైతే మరణించారో లేదా రాష్ట్రం విడిచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారో, అటువంటి వారి పెన్షన్లను మాత్రమే నిబంధనల ప్రకారం రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హత లేని వారు వ్యవస్థలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ డేటా ప్రకారం అనర్హులుగా తేలిన వారిని మాత్రమే తొలగించామే తప్ప, రాజకీయ కక్షసాధింపు చర్యలు ఎక్కడా జరగలేదని ఆయన ఉద్ఘాటించారు.
Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా
ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పెన్షన్లు, రుణాల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేస్తోందని, లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడా వివక్ష చూపడం లేదని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూస్తామని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com