అమరావతి, ఫిబ్రవరి 17 :
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీపనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గుంటూర
బుడంపాడు నారాకోడురు రహదారి పై ఘోర ప్రమాధం ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం సంఘటన స్థలంలోనే మృత్యువాత పడిన ముగ్గురు కూలీలు .ఆటోలో మొత్తం పదిమంది ప్రయాణికులు క్షతగాత్రులను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
- గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి.
- ముగ్గురు మహిళలు మృతి బాధాకరం.
- కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు.
- ప్రమాదంలో గాయపడిన వారికి జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రిఆదేశాలు.
- మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి రాంప్రసాద్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందన:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, “ఈ ఘటన మనందరినీ కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించాం” అని పేర్కొన్నారు.