Latest News: AP Weather: ఏపీకి వాతావరణశాఖ అలర్ట్..ఈ జిల్లాల్లో వర్షాలు

Read Time:  1 min
AP Weather
AP Weather
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మార్పులు చూపిస్తున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పరిసర జిల్లాల్లో ప్రస్తుతం సముద్ర మట్టానికి పైభాగంలో సుమారు 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల మేఘాలు వేగంగా ఏర్పడి, వర్షాలు కురిసే అవకాశం పెరిగింది.

Mithun Reddy Bail : మిథున్ రెడ్డికి బెయిల్.. కార్యకర్తల సంబరాలు

దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో (thunderbolts) కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.’కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా కొనసాగుతుంది.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 6.61,960క్యూసెక్కులు ఉండి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గరిష్ఠంగా 7లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉంది. గోదావరి నది భద్రాచలం వద్ద 45.70అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి దగ్గర ఇన్ ఫ్లో9.71,784 లక్షల క్యూసెక్కులు ఉంది..

AP Weather
AP Weather

రాత్రికి మొదటి హెచ్చరిక చేరుతుంది

రాత్రికి మొదటి హెచ్చరిక చేరుతుంది. ఎల్లుండికి దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం 2 NDRF, 4 SDRF బృందాలు కృష్ణా, గుంటూరు,

బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీపరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.సగోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది

భద్రాచలం దగ్గర నీటిమట్టం 48.4 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,21,847 క్యూసెక్కులు.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. గోదావరి మరింత వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులు కాగా.. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్రమత్తంగా ఉండాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.