ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం మరో భారీ ప్రణాళికను ప్రారంభించింది. రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు “మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (Mega Parent Teacher Meeting) (పీటీఎం) 2.0″ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇది కేవలం సాధారణ సమావేశం కాదు, రాష్ట్ర స్థాయిలో విద్యాభివృద్ధికి మూలస్తంభంగా మారే కార్యక్రమం.ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 61 వేల ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు భాగం కానున్నాయి. దాదాపు 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమానికి సాక్షులు కానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రధాన కార్యక్రమానికి హాజరవుతున్నారు.

తల్లిదండ్రులతో బంధాన్ని బలపరచే చొరవ
ఈ సమావేశంలో 74.96 లక్షల విద్యార్థులు, 3.32 లక్షల ఉపాధ్యాయులు, కోటి 20 లక్షల తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది విద్యా రంగానికి సంబంధించి ఇప్పటివరకు లెక్కలు చెప్పలేనంత పెద్ద ఈవెంట్గా నిలవనుంది. కార్పొరేట్ స్థాయిలో జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ను ప్రభుత్వ పాఠశాలలకూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ప్రణాళిక రచించారు.
పిల్లల ప్రగతిపై ప్రత్యక్ష సమాచారం
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిపై ఉపాధ్యాయుల నుంచి నేరుగా సమాచారం పొందగలుగుతారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. మౌలిక వసతులు, బోధన తీరుపై తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు. ఇది పాఠశాలల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.
విద్యా పండుగలా నిర్వహించాలనే లక్ష్యం
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి సంవత్సరం పండుగలా నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇది కేవలం పేరెంట్ టీచర్ మీటింగ్ కాదే, భవిష్యత్తు తరాల విద్యా మార్గదర్శిగా మారబోతుంది.
Read Also : Pawan Kalyan : జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన మాధవ్