ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెడికల్ షాపుల్లో (Medical Shops) మరోసారి కొత్త దందా వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకుండా విక్రయించకూడని వయాగ్రా, అబార్షన్ ట్యాబ్లెట్లు ఇష్టారీతిన విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “టార్గెట్ కస్టమర్” పేరుతో ఈ ట్యాబ్లెట్లు నిర్భందంగా విక్రయిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై, కొన్ని మెడికల్ షాపుల్లో సడెన్ రైడ్లు నిర్వహించారు.
అనుమతి లేకుండా అమ్మకాలు – ఆరోగ్యానికి ముప్పు
వయాగ్రా, అబార్షన్ ట్యాబ్లెట్లు (Viagra, Abortion Tablets) వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, మెడికల్ షాపుల్లో ఎలాంటి రెసిపీ లేకుండానే ఈ మందులు అమ్ముతూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. వయాగ్రా తరచూ ఉపయోగిస్తే గుండెకు సంబంధించి సమస్యలు రావచ్చని, అబార్షన్ మందులు సరిగ్గా వాడకపోతే గర్భస్థ శిశువు, తల్లి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది నైతికంగా, చట్టపరంగా కూడా సరైనది కాదని వారు పేర్కొంటున్నారు.
తనిఖీలు కఠినంగా – కఠిన చర్యల సూచన
తాజా ఆరోపణలతో మెలుకువ చెందిన ఆరోగ్య శాఖ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించి మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు, లైసెన్స్లు, రెసిపీలను పరిశీలిస్తున్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ షాపుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా ఈ తరహా మందులు వినియోగించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also : Jagan : జగన్ చిత్తూరు పర్యటనకు పోలీసుల అనుమతి