📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Latest News: Maredumilli Bus Accident: లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Author Icon By Anusha
Updated: December 12, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Maredumilli Bus Accident) చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన 35 మంది యాత్రికులు, ఇద్దరు డ్రైవర్లతో ఓ ప్రైవేటు బస్సు భద్రాచలంలో దర్శనం ముగించుకుని అన్నవరం బయలుదేరింది.

Read Also: Nara Lokesh: అన్ని రంగాల్లో ఎపి అనూహ్య అభివృద్ధి

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

చింతూరు-మారేడుమిల్లి (Maredumilli Bus Accident) ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్ట వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Maredumilli Bus Accident: Bus falls into a valley.. 8 people die

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో యాత్రికుల బంధువుల స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Alluri Sitarama Raju district accident Andhra Pradesh road accident Breaking News latest news Maredumilli Bus Accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.