📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest Telugu News: Mantha Cyclone: తుఫాను ముప్పు..4 రోజులు కుండపోత వర్షాలు

Author Icon By Vanipushpa
Updated: October 25, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండలంటూ శనివారం ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. తీవ్ర వాయుగుండంగా.. మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.. వాయుగుండం ఏపీ తీరం వైపు కదులుతుందని.. తీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈనెల 28 సాయంత్రం తుఫాను తీరం దాటనుంది. కళింగపట్నం – మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటనుంది.

గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

తుఫాను తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా.. 27 నాటికి తుపానుగా… 28 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.. తుఫానుగా బలపడితే ‘మోంతా’ గా నామకరణం చేయనున్నారు.

ఏపీలో భారీ వర్షాలు..

కాగా తుఫాన్‌ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా, మండల అధికారులతో విశాఖ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది.

తెలంగాణాలో కూడా భారీ వర్షాలు

తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రం లోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు , 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉంది. AccuWeather ప్రకారం సాయంత్రం 7 గంటలకు వర్షం పడే అవకాశం 52% ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా ఉన్నాయి. 


ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంది?

గాలి నాణ్యత సూచిక. హైదరాబాద్‌లో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 22 °c (డిగ్రీల సెల్సియస్)గా నమోదైంది మరియు గరిష్ట ఉష్ణోగ్రత 27 °c (డిగ్రీల సెల్సియస్) వరకు పెరిగే అవకాశం ఉంది.

Andhra Pradesh Cyclone Warning Heavy Rains imd Latest News Breaking News Mantha Cyclone Paragraph Telangana Telugu News weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.