ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ (Manamitra) గవర్నెన్స్ను తీసుకొచ్చింది. ప్రజలకు సేవలను సులభతరం చేసేందుకు వాట్సాప్ నంబరు 95523 00009ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ (Manamitra) ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
Read Also: Big Alert : ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: