ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, సీట్బెల్ట్ వేయని కార్ డ్రైవర్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంటూ, వారికి నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే వారి మొబైల్ ఫోన్లకు రోడ్డు భద్రతపై సందేశాలు పంపి చైతన్యం కల్పించాలి అని తెలిపారు.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 11 నవంబర్ 2025 Horoscope in Telugu
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు వంటి సంఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని నివారించేందుకు కేవలం చర్యలు కాకుండా నిర్మాణాత్మక ప్రణాళిక అవసరమని ఆయన సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల సాంకేతిక పరిశీలన, డ్రైవర్ శిక్షణ వంటి అంశాల్లో సమగ్ర విధానం అమలు చేయాలని ఆదేశించారు. పోలీస్, రవాణా, పంచాయతీ రాజ్, అర్బన్ డెవలప్మెంట్ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

అదే విధంగా రోడ్ల నాణ్యతపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లపై గుంతలు లేకుండా చేయాలని, దానికి అవసరమైన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాకాలం ముందు రోడ్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలపై ఎటువంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. “ప్రతి ప్రాణం విలువైనది… ప్రతి ప్రమాదం నివారించదగినదే” అని సీఎం చంద్రబాబు పేర్కొంటూ, ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాద రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/