మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న క్షేత్రం సిద్ధమవుతోంది. ఈ నెల 8 నుంచి 18 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం త్వరగా పూర్తయ్యేలా ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా దర్శన సమయం తగ్గించేలా క్యూలైన్ల సంఖ్యను పెంచారు. గంటకు 6 వేల నుంచి 7 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: Telangana: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

It’s a festive occasion for devotees going to Srisailam
దర్శన సమయాల్లో కీలక మార్పులు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శన సమయాల్లో స్పష్టమైన మార్పులు చేశారు. అతిశీఘ్ర దర్శనం రూ.500, శీఘ్ర దర్శనం రూ.300 టికెట్లు తీసుకున్న భక్తులకు కేవలం అరగంటలోనే దర్శనం పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. ఉచిత దర్శనం భక్తులు కూడా 40 నిమిషాల నుంచి గంటన్నరలోపు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. శివదీక్ష భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లను శ్రీశైలం (srisailam) ఆలయ అధికారిక వెబ్సైట్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తులు వన్ స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అవసరమైన సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది.
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
భక్తుల సౌకర్యం కోసం ఆలయం చుట్టుపక్కల టెంట్లు, గదులు, సత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్కు 40 ఎకరాల్లో 12 చోట్ల ఏర్పాట్లు చేశారు. ఉచితంగా నడిచే 12 బస్సులు, బ్యాటరీ వాహనాలు, కమాండర్ జీపులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. భద్రత కోసం 3 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు, డ్రోన్లు మరియు సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. నదిలో స్నానం చేసే ప్రాంతాల్లో భక్తుల రక్షణ కోసం 72 మంది గజ ఈతగాళ్లు, ఫెన్సింగ్, షవర్స్ ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల భద్రత కోసం క్యూఆర్ కోడ్ ఉన్న రిస్ట్ బ్యాండ్లు అందిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: