Latest News: Minister Nara Lokesh: నేడు సిఫీ డెటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న లోకేశ్

Read Time:  1 min
Minister Nara Lokesh
Minister Nara Lokesh
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ హబ్‌ (Digital Hub) గా మారడం లక్ష్యంగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఈరోజు విశాఖపట్నంలో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ (AI Edge Data Center) శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఆధునిక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు మైలురాయిగా నిలవనుంది.

AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం?

ప్రాజెక్ట్ రూపకల్పనలో నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ టెక్నాలజీ సంస్థ సిఫీ టెక్నాలజీస్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (Sifi Infinite Spaces Limited) అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఈ డేటా సెంటర్ నిర్మించబడనుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1,500 కోట్ల గా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్ నిర్మాణం పూర్తవుతుంది.

ఇందులో 50 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ (AI) ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ (Open cable landing station) ను కూడా ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

Minister Nara Lokesh
Minister Nara Lokesh

విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌

ఏఐ ఆధారిత డేటా సెంటర్ రూపంలో విశాఖ గ్లోబల్ డిజిటల్ గేట్‌వే (Visakhapatnam Global Digital Gateway) గా అవతరించనుంది. ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ద్వారా భారతదేశం, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య వేగవంతమైన డేటా కనెక్టివిటీ ఏర్పడనుంది.విశాఖ (Visakhapatnam) ను దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌ (IT Hub) గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

5 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం విశాఖలో ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.