📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Lokesh Helps : మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

Author Icon By Sudheer
Updated: July 10, 2025 • 7:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయిలాండ్‌లో జాబ్ ఆఫర్‌ల పేరుతో మోసపోయిన తెలుగు యువకులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Lokesh) సత్వరంగా స్పందించారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాలు అంటూ మాయ మాటలు చెప్పిన ఏజెంట్లను నమ్మి అక్కడకు వెళ్లిన యువకులు దోపిడీకి గురవుతున్నారని ఆయన తెలిపారు. వాస్తవంగా ఉద్యోగం ఉంటుందన్న నమ్మకంతో వెళ్లిన యువతను అక్కడ బలవంతంగా పని చేయిస్తున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.

సురక్షితంగా ఇండియాకు తీసుకురావడమే లక్ష్యం

ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై, బాధితులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి చర్యలు ప్రారంభించిందని లోకేశ్ వెల్లడించారు. ఈ తరహా మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిఘా పెట్టిందని, ఈ సమయంలో బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయబారి కార్యాలయాల ద్వారా బాధితులను గుర్తించి తరలించే పనిలో ఉన్నామని తెలిపారు.

వెరిఫికేషన్‌ అవసరం – అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు

ఈ తరహా మోసాలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన లోకేశ్, ఏదైనా విదేశీ జాబ్ ఆఫర్ వస్తే ముందుగా దానిని ధృవీకరించుకోవాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేకంగా రెండు నంబర్లు ఏర్పాటు చేసింది. వెరిఫికేషన్ కోసం +91-863-2340678 కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ ద్వారా 8500027678 నంబర్‌కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా యువతకు పూర్తి సమాచారం, సలహాలు అందిస్తామని పేర్కొన్నారు.

Read Also : Pawan Kalyan : జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన మాధవ్

helps Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.