తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh)కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President
) పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. వచ్చే రోజుల్లో జరగబోయే మహానాడు వేదికగా ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు పలువురు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, పార్టీ కార్యకర్తలు, నాయకులు లోకేశ్కి మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
లోకేశ్ నాయకత్వం అవసరం: జీవీ ఆంజనేయులు అభిప్రాయం
ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, కోట్లాది కార్యకర్తలు లోకేశ్ నేతృత్వాన్ని ఆశిస్తున్నారని చెప్పారు. “విజన్ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు యువశక్తి ఆధారంగా పార్టీ ముందుకు సాగాలి. లోకేశ్ నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుంది. ఎన్డీయే కూటమి నూటికి నూరు శాతం సీట్లు సాధించే దిశగా పయనిస్తుంది,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహానాడులో ఈ డిమాండ్ను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం ఖాయమన్నారు.
కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారు: ఆనం వెంకటరమణారెడ్డి
టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా లోకేశ్ పదవిపై స్పందించారు. “మా పార్టీలో పైనుంచి రుద్దే సంస్కృతి లేదు. కార్యకర్తలు కోరితేనే పదవులు వస్తాయి. లోకేశ్ను కీలక పదవిలో చూడాలన్నది కార్యకర్తల ఆకాంక్ష అయితే, అది జరగడం ఖాయం,” అని చెప్పారు. ఈ మహానాడు ప్రత్యేకంగా నిలిచేలా జరుగుతుందని, అది ఇతర పార్టీలకు కేస్ స్టడీగా ఉంటుందని అన్నారు. వైసీపీపై వ్యాఖ్యలు చేస్తూ, “వారు చచ్చిన పాము వంటివారు. రాష్ట్రానికి మంచి రోజులు తిరిగి వచ్చాయి,” అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also : Akhil Wedding : అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్?