వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వాసుదేవరెడ్డిని ప్రత్యేక విచారణ బృందం (SIT) తాజాగా అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన్ను A2 (రెండవ నిందితుడు) గా పేర్కొన్నారు. మద్యం టెండర్ల కేటాయింపులో అవకతవకలు, డిజిటల్ పేమెంట్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ. గత కొంతకాలంగా ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు, పక్కా ఆధారాలతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Tirupati: లాయర్స్ కాలనీలో నూతన సిసి రోడ్ల ప్రారంభం
వాసుదేవరెడ్డి గతంలోనే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, కోర్టు ఆ పిటిషన్లను డిస్మిస్ (తిరస్కరించడం) చేసింది. దర్యాప్తు సంస్థల వాదన ప్రకారం.. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడం, మద్యం సరఫరాలో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఆయనపై ఉన్న కేసును మరింత బలోపేతం చేశాయి. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించకపోవడం వెనుక భారీగా నిధుల మళ్లింపు జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ అరెస్టుతో ఈ కుంభకోణంలో మరికొందరు కీలక నేతలు లేదా అధికారుల ప్రమేయం బయటపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com