ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి ఏసీబీ (ACB) కోర్టు రేపటి వరకు రిమాండ్ విధించింది. దర్యాప్తు సంస్థల విచారణ అనంతరం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ స్కామ్లో మొదటి నిందితుడు (A1) రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి భారీ స్థాయిలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతూ, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమకు అనుకూలమైన మార్గాల్లో నిధులను మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు.
Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్
పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మద్యం సిండికేట్కు అవినాశ్ రెడ్డి ఒక ప్రధాన వ్యూహకర్తగా (Mastermind) వ్యవహరించినట్లు వెల్లడైంది. కొత్త మద్యం బ్రాండ్లకు మార్కెట్లో చోటు కల్పించడం కోసం, ముడుపులు చెల్లించిన కంపెనీలకు అనుకూలంగా ‘ఆర్డర్ ఫర్ సప్లై’ (Order for Supply) కేటాయించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని ఏసీబీ గుర్తించింది. అంటే, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తూ, కమీషన్లు ఇచ్చిన బ్రాండ్లకే అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :