📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu Naidu : అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది : చంద్రబాబు

Author Icon By Divya Vani M
Updated: June 29, 2025 • 6:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏడాది పాలన ముగిసిన సందర్భంగా, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చారు. ప్రభుత్వ విజయాలను బలంగా ప్రజల్లోకి చాటాలని, వైసీపీ కుట్రల్ని ఖండించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని పిలుపునిచ్చారు.2014లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజలకు వివరించలేకపోయామన్న ఆయ‌న, ఇప్పుడు అలాంటి లోపాలకు తావులేకుండా ఉండాలన్నారు. వివేకానందరెడ్డి హత్య (Vivekananda Reddy’s murder), కోడికత్తి ఘటనలు అన్నీ వైసీపీ కుట్రలేనని అన్నారు. ఇలాంటి అబద్ధ ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు.

ప్రజలకు అందుబాటులో ఉండండి

ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండాలని చంద్రబాబు నొక్కిచెప్పారు. చేయలేని పనులపై కూడా సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు అనుసరించాలంటే, మనం వారి మధ్య ఉండాలని సూచించారు.ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును ఆయన స్వయంగా సమీక్షించనున్నట్టు వెల్లడించారు. లోపాలుంటే మార్పు కోరుతానన్నారు. మార్చుకోకపోతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

వైఫల్యాలను సరిదిద్దుకుంటే అభివృద్ధే లక్ష్యం

ప్రజల ఆమోదమే లక్ష్యమని, పాలనలో లోపాలుంటే సరిచేసుకోవాలని సూచించారు. డబ్బుతో ఓట్లు కొనే పాలన అస్సలు కుదరదన్నారు.మొత్తం రూ.9,340 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, 8.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. పోలవరం, అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

స్మార్ట్‌గా పని చేయాలి

64 లక్షల మందికి పెన్షన్, ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాల వివరాలు గుర్తుచేశారు. 2029లో గెలుపు లక్ష్యంగా, నాయకులు పని చేయాలని స్పష్టం చేశారు.

Read Also : Bangladesh : బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం : ఐదుగురి అరెస్ట్

#APPolitics #ChandrababuNaidu #TDPNews AndhraPradeshDevelopment GoodGovernance YSRCPConspiracy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.