కళ్యాణదుర్గం : నేరం చేసిన వారు ఎంత గొప్ప వారైనా సరే చట్టపరిధిలో చర్యలు తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ప్రజా వేదికలో కార్యకర్తలు అధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి మాట్లాడుతూ, మద్యం కుంభకోణములో దోషులు ఎవరో మద్యం అక్రమ నిధులు ఎవరెవరు ఖాతాలకు ఎలా బదిలీ అయ్యాయో అన్ని విషయాలు సిట్ విచారణలో తేలుతుందని, దోషులుగా తేలిన వారెవరైనా, ఎంత గొప్ప వారైనా వదిలేది లేదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని పేర్కొన్నారు.
జగన్ జైలుకు వెళతాడా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ కక్ష సాధింపు పాలన ఉండదని, రాజకీయంగా ఎవరిని వేదించమని, అయితే నేరం చేసిన వారు తప్పకుండా శిక్షార్హులు అవుతారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) రాయలసీమకు చెందిన నాయకుడైనా, రాయలసీమ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువ తకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉక్కు కర్మాగారాన్ని ఐదేళ్లలో ప్రారంభించలేకపోయారన్నారు. గండికోట రిజర్వా యర్ పనులను కూడా పట్టించుకోలేదన్నారు. రాయలసీమలో సోలార్ ప్లాంట్లు, గాలిమరలు ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేయలేక పోయారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగులు జలాలను రాయలసీమ ప్రయోజనానికి ఉపయోగించుకునే రీతిలో కృషి చేస్తున్నారన్నారు. సాగునీరు పరిశ్రమలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
హంద్రీనీవాకు 3,500 కోట్ల రూపాయలు కేటాయించి రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా మరో 3800 కోట్లు వెచ్చించి కాలువ వెడల్పుతో పాటు, లైనింగ్ పనులు చేపట్టి కుప్పం ప్రాంతానికి కూడా సాగునీరు అందించేందుకు కృషి జరుగు తుందన్నారు. అంతే కాకుండా 2018 లోనే జీడిపల్లి రిజర్వాయర్ నుండి కళ్యాణదుర్గంరాయదుర్గం ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించే బిటిపి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా బీటీపీకి రెండు టీఎంసీలు, కళ్యాణదుర్గానికి 114 చెరువుల ద్వారా సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయన్నారు.-(Law and Order)
Read Hindi News : hindi.vaartha.com
Read also : Tirumala : శ్రీవాణి టికెట్ల జారీలో మార్పులు!