Latest News: Laurus Labs: విశాఖలో లారస్ ల్యాబ్స్ భారీ పెట్టుబడి

Read Time:  1 min
Laurus Labs
Laurus Labs
FONT SIZE
GET APP

దేశీయ ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిచిన ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్ (Laurus Labs) ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టబోతోంది. రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచే ఈ ప్రాజెక్టు విశాఖపట్నం వద్ద ఏర్పాటు కానుంది. సంస్థ రూ.5,000 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఉత్పత్తి యూనిట్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతుందని అధికారికంగా ప్రకటించింది.

Read Also: AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 532 ఎకరాల భూమిని కేటాయించిందని లారస్ ల్యాబ్స్ (Laurus Labs) సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు.ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ కాల్‌లో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ మెగా యూనిట్‌ను రాబోయే ఎనిమిదేళ్లలో దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు.

Laurus Labs
Laurus Labs

విశాఖలో 532 ఎకరాలపై మెగా యూనిట్

ప్రాజెక్టు అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సత్యనారాయణ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు. కర్ణాటక (Karnataka) లోని మైసూరులో ఏర్పాటు చేయాలని తొలుత భావించిన భారీ ఫెర్మెంటేషన్ యూనిట్‌ను కూడా విశాఖపట్నంకు తరలిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో మొత్తం కార్యకలాపాలు విశాఖ కేంద్రంగానే జరగనున్నాయి. భారీ పెట్టుబడితో విశాఖ ఫార్మా రంగంలో మరింత కీలకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ సంస్థ‌కు హైద‌రాబాద్‌, ముంబ‌యి, బెంగ‌ళూరు, కాన్పూర్‌ల‌లో త‌యారీ, ప‌రిశోధ‌నా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఏడు వేల‌కుపైగా ఉద్యోగులు ఉన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.