ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న అంశం పేదల ఇళ్ల నిర్మాణ పథకంలో జరిగిన అవినీతి ఆరోపణలు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఈ విషయం మీద గట్టి వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం ప్రారంభించిన ఇళ్ల నిర్మాణ పథకం అవినీతి బారిన పడిందని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారని ఆయన వెల్లడించారు.
దొంగ సంతకాలు సృష్టించి మెటీరియల్ను పక్కదారి పట్టించారని
గత ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. మెటీరియల్ కొనుగోళ్ల కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించి, లబ్ధిదారుల పేరుతో దొంగ సంతకాలు సృష్టించి మెటీరియల్ (Material) ను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. కేవలం స్టీల్ కొనుగోలులోనే దాదాపు రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని, మార్కెట్ ధరల కంటే అధిక ధరకు ఐరన్ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

ఇళ్లకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారని
కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను వివరిస్తూ, రూ.630 విలువ చేసే ఒక స్టిక్కర్ను ఏకంగా రూ.1,300కు కొనుగోలు చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం ఇళ్లు పునాది దశలోనే ఆగిపోయాయని, నాణ్యతను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఒక ఇంటికి కేటాయించిన సిమెంట్ను మూడు ఇళ్లకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం చేసిన భూముల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: