ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
విజయవాడ : ప్రతి మనిషి తన వారసత్వ మూలాలు, జీవన పరిణామ క్రమం, సాంస్కృతిక వికాసంపై నిరంతరం దృష్టి పెట్టాలని శాసనసభలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య (Government Whip Thangirala Soumya) అన్నారు. మన గురించిన అవగాహన సామాజిక ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. విజయవాడ లోని పోరంకి మురళి రిసార్ట్స్ లో ఆదివారం నాడు నిర్వహించిన’ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం రాజకీయ, సామాజిక ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించడంతో పాటు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ . ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీ రాం తాతయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించడంతో పాటు, ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది.

విజయవాడ యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనియాడారు
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సాహిత్య చర్చలు వివిధ సామాజిక కార్యకలాపాలు జరిగాయి. తంగిరాల సౌమ్య గారు తమ ప్రసంగంలో విజయవాడ యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని (Cultural diversity) కొనియాడారు. విజయవాడ ఎప్పుడూ సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇటువంటి ఉత్సవాలు మన సంప్రదాయాలను రక్షించడంతో పాటు, యువతకు మన సంస్కృతిని పరిచయం చేసే అవకాశం కల్పిస్తాయిఅని ఆమె అన్నారు.
ఉత్సవ నిర్వహణలో చూపిన శ్రద్ధ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను కూడా తంగిరాల సౌమ్య గారు ప్రస్తావించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతిని ధులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పోరంకి మురళి రిసార్ట్స్ లోని అందమైన వాతావరణం, ఉత్సవ నిర్వహణలో చూపిన శ్రద్ధ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ ఉత్సవం విజయవాడ నగరం యొక్క సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడంతో పాటు, రాజకీయ నాయకులు, ప్రజల మధ్య సమన్వయాన్ని పెంపొందించే వేదికగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: