Latest News: Anantapuram – దేవుడి హుండీ సొమ్మును అక్కడే ఉంచిన దొంగలు

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

దొంగల్లో కూడా మంచివారు ఉంటారు. కడుపు నింపుకునేందుకు దొంగతనం (Theft) చేస్తారు. ఆ తర్వాత తప్పు చేశామని చింతించేవారుఉంటారు. కొందరు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి, అందినకాడికి దోచుకుంటారు. అడొచ్చినవారిని హతమార్చేందుకువెనుకాడరు. ఎన్ని హత్యలు చేసేందుకుకైనా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వారి నేరాలకు హద్దులు అనేది ఉండదు. వీరిని కరుడుగట్టిక దొంగలుగా భావిస్తారు. అయితే మెత్తడి మనసున్న దొంగలు సైతం లేకపోలేదు. ఇలాంటి ఆసక్తికర దొంగల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

హుండీని ఎత్తుకెళ్లి మళ్లీ అదే స్థలంలో ఉంచారు

అనంతపురం (Anantapuram) జిల్లాలోని బుక్కరాయ సముద్రం దగ్గర చెరువు కట్ట వద్ద వున్న ముసలమ్మ ఆలయంలో దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నెలరోజుల క్రితం జరిగింది. ఆ దొంగలకు ఏమనిపించిందో ఏమో తీసుకెళ్లిన హుండీని తిరిగి అక్కడే పెట్టారు. ఆ హుండీలోని 1,86,486 రూపాయల డబ్బును గుడిలో పెట్టారు. అందులో ఓ లేఖ కూడా రాసి పెట్టి ఉంది. డబ్బులు దొంగలించిన తర్వాత తమ పిల్లల ఆరోగ్యం బాగలేదని అందుకే డబ్బును తిరిగి గుడిలో పెడుతున్నామని దొంగలు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఇలా దొంగల్లో ప్రవర్తన వచ్చి డబ్బును తిరిగి గుడిలోనే పెట్టడం విశేషం.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nara-lokesh-meets-pm-modi-delhi/andhra-pradesh/541825/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.