📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు – అంబటి

Author Icon By Sudheer
Updated: February 10, 2025 • 10:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని అనడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు వంతపాడుతున్నారని విమర్శించారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ “చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాకే AR సప్లైస్ సంస్థ ద్వారా నెయ్యి సరఫరా మొదలైంది. మరి మా హయాంలో లడ్డూ ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది?” అంటూ ప్రశ్నించారు. టీటీడీ ప్రసాదానికి సంబంధించి అప్రస్తుతం ఆరోపణలు చేయడం దారుణమని, ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని చేయబడిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని అంబటి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దెబ్బతీయడం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. అసలు విషయం దాచి ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ మార్పు తర్వాత అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. “టీటీడీ పరిధిలో తయారయ్యే లడ్డూ ప్రసాదం ఎప్పటిలాగే పవిత్రంగా, భక్తుల నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.

ambati rambabu Google news tirumala tirumala laddu controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.