Kyvalya Reddy: ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి కుంచాల కైవల్య రెడ్డి అంతరిక్ష రంగంలో అరుదైన విజయాన్ని సాధించింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆమె, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్ఠాత్మక వ్యోమగామి శిక్షణ (Astronaut training) కార్యక్రమానికి ఎంపికయ్యారు. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 150 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వారిలో కైవల్య ఒకరిగా నిలవడం గర్వకారణం. నాలుగేళ్ల పాటు సాగే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత, ఎంపికైన వారు 2029లో అంతరిక్ష యాత్ర చేయనున్నారు. ఈ యాత్రలో వ్యోమగాములు భూమి నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి, 3 గంటలపాటు జీరో గ్రావిటీని అనుభవించనున్నారు.
Read also: AP Police Recruitment: ఆంధ్రాలో నిరుద్యోగ యువతకు శుభవార్త..

Kyvalya Reddy: అమెరికా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన ఏపీ అమ్మాయి
17 ఏళ్ల వయసులోనే
Kyvalya Reddy: కైవల్యకు నాసా మాజీ వ్యోమగాములు విలియం మెక్ఆర్థర్, బ్రెజిల్ తొలి వ్యోమగామి మార్కోస్ పోంటెస్ శిక్షణ ఇవ్వనున్నారు. కైవల్య తండ్రి శ్రీనివాసరెడ్డి నిడదవోలు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుంచే అంతరిక్షం, ఖగోళశాస్త్రంపై ఆసక్తి ఉన్న కైవల్య భవిష్యత్తులో ఆస్ట్రోఫిజిక్స్లో ఉన్నత విద్యను జర్మనీలో అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 17 ఏళ్ల వయసులోనే ఈ స్థాయికి చేరిన కైవల్య, 2023లో నాసా ఆధ్వర్యంలో జరిగిన “ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్” (IASP) లో కూడా పాల్గొని అమెరికాలో శిక్షణ పొందింది. ఆమె పట్టుదల, కృషి భవిష్యత్తులో భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం రాసే అవకాశం ఉందని పలువురు అభినందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: