Telugu News: Kurnool: పొలాల్లోనే పత్తి కొట్టేసిన దొంగలు – రైతులు ఆందోళనలో

Read Time:  1 min
Kurnool
Kurnool
FONT SIZE
GET APP

దొంగతనాలు ఇప్పుడు ఇళ్లు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు పంట పొలాల దగ్గర కూడా దొంగలు విరుచుకుపడుతున్నారు. కర్నూల్ (Kurnool)జిల్లాలో జరిగిన తాజా ఘటన దీనికి నిదర్శనం. రాత్రికి రాత్రే రైతు పొలంలో పండిన పత్తిని(Cotton) దొంగలు దోచుకుపోయారు. కర్నూల్(Kurnool) జిల్లాలోని కోసగి గ్రామానికి చెందిన రైతు కోసిగయ్య తన 1 ఎకరం 50 సెంట్ల భూమిలో పత్తి పంట వేసి, దానికి సుమారు ₹1.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట బాగాగా పెరిగి, కోతకు సిద్ధమైంది. కూలీలతో కోత కోసం మాట్లాడుకున్న రైతు తెల్లారే పొలానికి వెళ్లి చూస్తే, మొత్తం పత్తి మాయమైందని గుర్తించాడు.

Read Also: Rajasthan: తండ్రి చేతిలో పాప కిడ్నాప్‌

Kurnool

“15 క్వింటాళ్ల పత్తి మాయమైంది” – బాధలో రైతు

“మా కుటుంబం అంతా కష్టపడి పంట వేసాం. వానలతో కొంత నష్టం వచ్చినా, చివరికి పంట బాగానే పండింది. కానీ రాత్రికి రాత్రే 15 క్వింటాళ్ల పత్తిని దొంగలు ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు” అంటూ రైతు కోసిగయ్య విచారం వ్యక్తం చేశాడు.

రైతులకు కొత్త సవాలు – పంటకూ కాపలా అవసరం

ఇలాంటి ఘటనలతో రైతుల్లో భయం నెలకొంది. పంట పొలాల దగ్గర కూడా ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను కాపాడుకోవడమే కాదు, ఇప్పుడు పంటలను కూడా రక్షించుకోవడం రైతులకు మరో పెద్ద సవాలుగా మారింది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కోసగి గ్రామంలో జరిగింది.

దొంగలు ఏం దోచుకుపోయారు?
రైతు కోసిగయ్య పొలంలో పండిన సుమారు 15 క్వింటాళ్ల పత్తిని దొంగలు దోచుకుపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.