News Telugu: Kurnool Sports: క్రీడల అభివృద్ధికి సహకరించండి: రాష్ట్ర మంత్రి టిజి భరత్

Read Time:  1 min
News Telugu: Kurnool Sports: క్రీడల అభివృద్ధికి సహకరించండి: రాష్ట్ర మంత్రి టిజి భరత్
FONT SIZE
GET APP

సచివాలయం: కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కోరిన రాష్ట్ర మంత్రి టిజి భరత్ క్రీడల్లో కర్నూలు జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ (T.G Bharat) తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి కర్నూలు జిల్లాకు సంబంధించి క్రీడల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. రాయలసీమకు ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా, ఏపిలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, విద్యా కేంద్రంగా ఉన్న కర్నూలు, క్రీడా నైపుణ్య సమూహంగా మారడానికి బలమైన సామర్ధ్యాన్ని కలిగి ఉందని వివరించారు.

Read also: Road Safety: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై కఠిన చర్యలు

Kurnool Sports

Contribute to the development of sports

రూ.45.16 కోట్ల విలువైన ప్రాజెక్టులకు

ఖేలో ఇండియా కింద కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.45.16 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ఆయనకు వివరాలు ఇచ్చారు. ఇండోర్ స్పోర్ట్స్ హాల్స్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఫుట్బాల్ టర్ఫ్, స్క్వాష్ కోర్టు అవసరమని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సౌకర్యాలు యువ ప్రతిభను పెంపొందించడమే కాకుండా స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తాయని, యువతకు బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాయన్నారు. వీటన్నింటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాను క్రీడల పరంగా అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేసినట్లు చెప్పారు. జిల్లా నుండి క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని విధాల సహకారం అందిస్తానని చెప్పారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.