📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Kurnool: కర్నూల్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ పలువురు

Author Icon By Rajitha
Updated: October 24, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kurnool: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మృతిచెందారు. మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసాయి. బస్సు నుంచి ఇప్పటివరకు 19 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Read also: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

Kurnool: కర్నూల్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ పలువురు

అయితే, ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎం. సత్యనారాయణ, హైదరాబాద్‌ మియాపూర్‌ (Miyapur) కు చెందిన జయసూర్య, హయత్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌, బెంగళూరుకు చెందిన సరస్వతి నిహారిక ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేశ్‌ కుటుంబం భార్య శ్రీలక్ష్మి, పిల్లలు జస్విత, అభిరామ్‌ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు గాయాలతో చికిత్స పొందుతున్నారని, ఇంకా కొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఏ ప్రమాదం జరిగింది?
హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు దగ్ధమై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు?
మొత్తం 19 మంది ప్రయాణికులు మృతిచెందారు.

Bus Accident Chinna Tekuru Kaveri Travels kurnool latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.