Telugu News:Kurnool:ఘోర రోడ్డు ప్రమాదం – మహిళ మృతి, 12 మందికి గాయాలు

Read Time:  1 min
Kurnool
Kurnool
FONT SIZE
GET APP

కర్నూల్(Kurnool) జిల్లాలో మరో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో పత్తి కూలీలతో వెళ్తున్న ఆటోను కర్ణాటకకు చెందిన తుఫాన్ వాహనం వెనుకనుండి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రంగవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది కూలీలు గాయపడ్డారు.

Read Also: HYD: ఆర్థిక మోసగాడిని తప్పించిన కేసులో మరికొందరు అధికారుల ప్రమేయం

Kurnool
Kurnool:ఘోర రోడ్డు ప్రమాదం – మహిళ మృతి, 12 మందికి గాయాలు

మంత్రాలయం వెళ్లే దారిలో విషాదం
ఈ ప్రమాదం ఆదోని మండలం కపాటి గ్రామానికి చెందిన(Kurnool) పత్తి కూలీలతో జరిగింది. వారు మంత్రాలయం మండలంలోని కల్లు దేవకుంటకు పత్తి ఏరేందుకు వెళుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
ప్రమాదం(Road Accident) గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేక ఇతర కారణాల వలన ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.