Kurnool Bus Accident Video : కర్నూలు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘోరంగా జరిగింది. 2025 అక్టోబర్ 24న జరిగిన ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా చిన్నటేకూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సులోని ఇంధన ట్యాంకు పేలిపోవడంతో మంటలు చెలరేగాయి.
Read also : Fire Accident: అగ్నికి కాలి బూడిదైన కేఫ్!
బస్సు ప్రమాదం వివరాలు
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు, 30 మందికి పైగా ప్రయాణికులతో, రాత్రి 9 గంటల ప్రాంతంలో బయలుదేరింది. ఈరోజు తెల్లవారుజామున కర్నూల్ షివారులోని చిన్నటేకూరు వద్ద బస్సు వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైంది. బస్సు దాదాపు 300 మీటర్లు దూకిన తరువాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర చర్చలకు కారణమైంది. 20 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారని తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :