📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Kurnool Bus Accident: మొబైల్ ఫోన్లే ప్రాణాలమీదకు తెచ్చిందా?

Author Icon By Saritha
Updated: October 25, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు(Kurnool Bus Accident) అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగం పుంజుకుంది. ఫోరెన్సిక్ బృందాలు సేకరించిన ప్రాథమిక నివేదిక ప్రకారం, లగేజీలో ఉన్న వందల మొబైల్ ఫోన్ల(Mobile phone) పేలుళ్లే మంటలు తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణమని తేలింది. చిన్నటేకూరు సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘర్షణ సమయంలో బైక్‌ ఆయిల్ ట్యాంక్‌ నుంచి పెట్రోల్ లీకై, నిప్పురవ్వలు చెలరేగడంతో మంటలు మొదలయ్యాయి. ఆ మంటలు బస్సు లగేజీ భాగానికి వ్యాపించాయి. అక్కడ ఉన్న మొబైల్‌ ఫోన్ల పార్సిల్‌కు నిప్పు అంటుకోవడంతో, వాటి బ్యాటరీలు పేలిపోయి పరిస్థితి అదుపు తప్పింది.

Read also: బస్సు పక్కకి తొలగించే యత్నంలో బోల్తా పడ్డ క్రేన్ .. ఒకరికి తీవ్ర గాయాలు

Kurnool Bus Accident: మొబైల్ ఫోన్లే ప్రాణాలమీదకు తెచ్చిందా?

ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక అంశాలు

సుమారు 400కు పైగా మొబైల్‌ ఫోన్లు(Kurnool Bus Accident) ఒకేసారి పేలడంతో మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయని నిపుణులు గుర్తించారు. ఈ కారణంగా బస్సు ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్‌ ఆధారాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన అన్ని కోణాలను పరిశీలిస్తూ, నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే దానిపై కూడా దృష్టి సారించారు.

ప్రమాదానికి కారణం ఏమిటి?

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బైక్‌ను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు బస్సు లగేజీ భాగానికి వ్యాపించి, అక్కడ ఉన్న మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్ల మంటలు విపరీతంగా వ్యాపించాయి.

లగేజీలో ఎంతమంది మొబైల్‌ ఫోన్లు ఉన్నాయ్?

ఫోరెన్సిక్‌ బృందం అంచనా ప్రకారం, 400కు పైగా మొబైల్‌ ఫోన్లు లగేజీ విభాగంలో ఉన్నాయి.

ఈ మొబైల్‌ ఫోన్లు ఎందుకు బస్సులో ఉన్నాయి?

ఆ ఫోన్లు ఒక పార్సిల్‌ షిప్‌మెంట్‌ రూపంలో తరలించబడుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bus Fire Forensic Report Investigation kurnool Latest News in Telugu Mobile Explosion Police Inquiry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.