చంద్రబాబు (Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పం ఎట్టకేలకు నీటి తడిని చూసింది. శతాబ్దాల నిరీక్షణకు చరమాంకం పలకుతూ, శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చిన కృష్ణా జలాలు కుప్పం గడ్డను తాకాయి (Krishna waters reach Kuppam Gadda) .ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ట్విటర్ వేదికగా, నాడు చెప్పాను… నేడు చేసి చూపించాను అంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు.అసెంబ్లీ వేదికపై ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ, తాను అప్పట్లో చెప్పిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. మదనపల్లె, పలమనేరుతో పాటు పులివెందులకు కూడా నీళ్లు తీసుకువస్తానన్న మాట ఇప్పుడు నిజమైందని చెప్పారు.(Chandrababu)
ప్రజల హర్షాతిరేకం
కుప్పానికి కృష్ణా జలాలు చేరుకోవడాన్ని స్థానికులు పండగలా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చి కృష్ణా జలాలకు ఘన స్వాగతం పలికారు.సామాన్య రైతు నుంచి పార్టీ కార్యకర్తల వరకూ అందరూ ఆనందాశ్రువులు పెట్టారు. కాలువలోకి దిగుతూ నినాదాలు చేశారు. “కుప్పానికి నీరు – చంద్రబాబు ధీరుడు” అంటూ నినాదాలు మార్మోగించాయి.
తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతాలో ఈ భావోద్వేగ దృశ్యాల వీడియోలు షేర్ చేయడంతో, అవి వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ప్రజల చిందులు, ఆనంద క్షణాలే దర్శనమిచ్చాయి.
విపక్షానికి కౌంటర్
ఈ అభివృద్ధి కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ, చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని పలువురు నేతలు ప్రశంసించారు. నమ్మకంగా ఇచ్చిన మాటను నిలబెట్టడం చంద్రబాబుకు చెల్లిన మాటే. ఇది కేవలం రాజకీయ గెలుపు కాదు, ప్రజల గుండెల్లో వేసిన ముద్ర.ఈ నీరు కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్టు కాదు. ఇది కుప్పం రైతుల కన్నీళ్లకు తెర వేసిన చరిత్రాత్మక పరిణామం. భవిష్యత్తులో ఈ నీరు లక్షల ఎకరాల పంటల్ని ప్రాణాలుగా నిలబెట్టనుంది.ఇప్పటి వరకు ఊహగా ఉన్న నీటి కల, ఇప్పుడు వాస్తవంగా మారింది. చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మకంగా నిలబడి, కుప్పం ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి.
Read Also :