ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల ప్రారంభమైన S.I.T (Special Investigation Team) విచారణ నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సిట్ నోటీసులు, పలు స్థాయిలలో జారీ అయిన విచారణలకు స్పందనగా మాజీ సీఎం వైఎస్ జగన్ తనపై ఆరోపణలు వెల్లువెత్తుతాయన్న ఆందోళనలో ఉన్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపణలు చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వ హయాంలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు. జగన్ గుండెల్లో గుబులు మొదలైంది గత ప్రభుత్వం హయాంలో మద్యం రంగంలో ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనేది త్వరలోనే బయటపడబోతోంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ దారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, అని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో(Liquor scam) జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీల ద్వారా సుదీర్ఘంగా సాగిన అవినీతి పథకాలు లభించే అవకాశముందన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి ఉదాహరణ
గతంలో గాలి జనార్ధన్ రెడ్డి అవినీతి కేసును ప్రస్తావిస్తూ, “అనేకమంది జగన్ నేతృత్వంలోని నాయకులు అప్పట్లో చంద్రబాబు చేస్తున్న పోరాటాన్ని విమర్శించారు. కానీ నేడు గాలి కేసులో న్యాయస్థానం శిక్ష విధించింది. అదే విధంగా లిక్కర్ స్కామ్లో కూడా తప్పించుకునే అవకాశం లేదు,” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ద్వారా మంత్రి ప్రభుత్వ విచారణకు న్యాయబద్ధతను కల్పిస్తూ, జగన్ను తప్పించుకునే ప్రయత్నాలన్నీ వృథానేనని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీలో మద్యం మార్కెటింగ్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి మారింది. లిక్కర్ స్కామ్లోనూ దోపిడీదారులు తప్పించుకోవడం అసాధ్యమని మంత్రి చెప్పారు. మద్యం కుంభకోణానికి సంబంధించి త్వరలోనే అన్నీ నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.
Read also: Nandigam Suresh: నందిగం సురేశ్ అరెస్ట్ పై స్పందించిన తుళ్లూరు డీఎస్పీ