Kollu Ravindra statement : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ అంశంపై చర్చించేందుకు ధైర్యం ఉంటే ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది సభ్యులతో రావాలని వైసీపీ అధినేత **వైఎస్ జగన్మోహన్రెడ్డి కు సవాల్ విసిరారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, జగన్ ఐదేళ్ల పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో కూడా కల్తీ జరిగిందని తీవ్రంగా విమర్శించారు. కేవలం లాభాల కోసమే నిబంధనలను సడలించి, పాలు లేని డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేశారని ఆరోపించారు. 4 లక్షల లీటర్ల ఆవుపాల సామర్థ్య నిబంధనను కావాలని తొలగించారని దుయ్యబట్టారు.
Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు, రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు మంత్రి తెలిపారు. మోనో గ్లిజరైడ్, బీటా క్యారటిన్, లాక్టిక్ యాసిడ్, ఎసిడిక్ యాసిడ్ వంటి రసాయనాలు ఉన్నాయని వివరించారు. మోనో గ్లిజరైడ్లో జంతు కొవ్వు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక వచ్చాక మరిన్ని నిజాలు బయటకు వస్తాయని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. దైవ ప్రసాదం విషయంలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం రాజీ పడబోదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: