ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొడాలి నాని (Kodali Nani)కి తాజాగా విశాఖపట్నం పోలీసులు నోటీసులు జారీ (Police issued notices) చేశారు. గతంలో నమోదైన ఓ కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల ద్వారా ఆదేశించారు.
2024లో విద్యార్థిని ఫిర్యాదు నేపథ్యంలో
2024లో ఆంధ్రా యూనివర్సిటీ లా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న అంజనప్రియ అనే విద్యార్థిని, విశాఖ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఆమె మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన సమయంలో కొడాలి నాని (Kodali Nani), ప్రధాన ప్రతిపక్ష నేతలపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లను తీవ్రంగా దుర్భాషలాడారని అంజనప్రియ (Anjanapriya) ఆరోపించారు. తీవ్రంగా దూషించిన విధానం నన్ను, ఓ మహిళగా తీవ్రంగా బాధించింది” అని పేర్కొన్నారు.

ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు
ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకొని అప్పట్లో పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్లు 353(2), 352, 351(4) కింద కేసు నమోదు చేశారు. సీఐ రమణయ్య ఈ కేసును రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా, తాజాగా పోలీసులు మరింత ముందడుగు వేశారు.
విశాఖ పోలీసులు, కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని నివాసానికి వెళ్లి 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందజేశారు. విచారణ కోసం హాజరుకావాల్సిందిగా స్పష్టంగా ఆదేశించారు. ఈ నోటీసులు ఆదివారం నాడు వ్యక్తిగతంగా అందచేయబడినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read also: