हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

Sudheer
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరు పిల్లలకు రూ.15,000 చొప్పున నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావడం నేపథ్యంలో, ఆలోపే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఇది విద్యార్థుల విద్యాసహాయం కోసం ఉపయోగపడేలా చేయడమే లక్ష్యం.

ఆధార్, ఎన్‌పీసీఐ లింకింగ్ తప్పనిసరి

తల్లుల ఖాతాల్లో నగదు నేరుగా జమ కావాలంటే, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు, బ్యాంక్ ఖాతా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో అనుసంధానం చేయడం కూడా అవసరం. దీనివల్ల లబ్ధిదారులను సులభంగా గుర్తించడమే కాక, నిధులు నేరుగా వారి ఖాతాల్లో పారదర్శకంగా జమ చేయడం సాధ్యమవుతుంది. లింక్ చేయని ఖాతాల్లో రూ.15,000 ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

జూన్ 5లోగా లింకింగ్ పూర్తి చేసుకోవాలి

ప్రభుత్వం (AP Govt) సూచనల మేరకు జూన్ 5వ తేదీలోగా తల్లుల బ్యాంకు ఖాతాలను ఆధార్, ఎన్‌పీసీఐతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్, సచివాలయ సిబ్బంది, బ్యాంకింగ్ అధికారులు సహకరిస్తారు. తల్లులు ఆయా బ్యాంకులను సంప్రదించి లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ ద్వారా ఈ లింకింగ్ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. ఇది చేయకపోతే తల్లికి వందనం పథకం ద్వారా అందే ఆర్థిక సాయం పొందలేని పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ అప్డేట్‌ను అన్ని తల్లులు పరిగణలోకి తీసుకోవడం ఎంతో అవసరం.

Read Also : Rohit Sharma: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870