Kavitha new party : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ఆ పార్టీ నినాదం “తెలంగాణ ముందుగా” అని ఆమె స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గానికి చేరుకున్న కవిత అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ పార్టీ కులం, మతం, వర్గాల మధ్య విభేదాలు లేకుండా ప్రజల సేవను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆమె విమర్శించారు. అందుకే కొత్త రాజకీయ వేదిక అవసరమైందని తెలిపారు.
Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్
గత నాలుగేళ్లుగా తాను మరియు తన కుటుంబ (Kavitha new party) సభ్యులు చేయని తప్పుకు తీవ్ర మానసిక వేదన అనుభవించామని కవిత అన్నారు. తనపై నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేయడంతో తాను తిరుమల శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కాలి నడకన వచ్చానని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా ఆమె స్పందించారు. ప్రజల సమస్యలను నిజంగా అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. తాను ఎప్పుడూ పేదల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు.
ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని కవిత స్పష్టం చేశారు. రాజకీయ ఆధిపత్యాన్నే తాము వ్యతిరేకించామని ఆమె పేర్కొన్నారు. కవిత ప్రకటించిన ఈ కొత్త రాజకీయ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: