విజయవాడ : కార్తీక మాసం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో
పంచారామాలకు ప్రత్యేక బస్సులను(Karthika masam) నడపనున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ కృష్ణ చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పంచారామాల టూర్ ప్యాకేజీలో భాగంగా అమరలింగేశ్వర స్వామి అమరావతి, సోమేశ్వర స్వామి భీమవరం, క్షీ రారామలింగేశ్వర స్వామి పాలకొల్లు, భీమేశ్వర స్వామి ద్రాక్షారామం, కుమారరామ స్వామి, సామర్లకోట పంచారామ క్షేత్రాలు ఉన్నాయన్నారు.
Read also: బంగారం ధరలు తగ్గాయి..

ప్రతి సోమవారం బయలుదేరే టూరిజం ప్రత్యేక బస్సులు
ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న టూరిజం(Karthika masam) కేంద్ర రిజర్వేషన్ కార్యాలయం నుండి ఈ నెల 27, నవంబర్ 03,10,17 సోమవారం తేదీల్లో బస్సులు బయలు దేరతాయన్నారు. పెద్దలకు: రూ.2130/, పిల్లలు: రూ.1760 లు ధర ఉంటుందన్నారు. ప్రతి శనివారం విజయవాడ నుండి వాడపల్లి వరకు ప్రత్యేక బస్ ను పర్యాటక శాఖ నిర్వహిస్తోందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: