కాణిపాకం : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి ఆదివారం కుటుంబసమేతంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఎఇఓ రవీంద్రబాబు, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Read also: HYD: Sr. NTR వర్ధంతి.. ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య

High Court judge visits Lord Ganesha
Kanipakam: అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి వేదమంపడపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలలో కూడా పూజలు నిర్వహించారు. వారి వెంట సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక ఎస్ఐ నరసింహులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: